NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆల‌యంలో విషాధం.. 12 మంది మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌మ్మూక‌శ్మీర్ లోని వైష్ణోదేవి ఆల‌యంలో విషాధం చోటుచేసుకుంది. కొత్త సంవ‌త్స‌రం వేళ శ‌నివారం తెల్ల‌వారుఝామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణో‌దేవి మందిరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించగా మరికొంతమంది భక్తులు గాయపడ్డారు.క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించారు. వైష్ణోదేవి భవన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల సంఖ్యపై కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియ లేదు మృతదేహాల పోస్ట్ మార్టం అవుతోందని డాక్టర్ గోపాల్ చెప్పారు.

About Author