PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో అర్చకులకు శిక్షణ తరగతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో అర్చకులకు ఈనెల 26 నుండి 27వ తేదీ సాయంత్రం వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా లో ఉన్నటువంటి అన్ని ఆలయాల అన్ని ఆ గమము ల అర్చకులకు అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు మహానంది క్షేత్రంలోని పోచ బ్రహ్మానంద రెడ్డి భవనంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి అర్చక డైరెక్టర్ వేదాంత గోపాల చక్రవర్తి మరియు అర్చక చీఫ్ కోఆర్డినేటర్ వి ఎం శర్మ శిక్షణ తరగతులకు హాజరవుతున్నట్లు ఈవో తెలిపారు.

About Author