NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తొక్కిస‌లాట కేసు.. షారూక్ కు ఊర‌ట‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: 2017లో నమోదైన కేసు నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు షారూఖ్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును కొట్టివేయాలంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ‘రాయిస్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా షారూఖ్ తన చిత్రబృందంతో కలిసి 2017లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూఖ్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది.

                                   

About Author