NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూరు ఎంపీడీఓ అనంతపుర్​కు బదిలీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు.ఎన్నికలు దగ్గరికి సమీపిస్తున్నందున బదిలీల్లో భాగంగా అధికారులు ఇతర జిల్లాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు నాలుగు నెలల పాటు అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి రిలీవ్  అయి అనంతపురం జిల్లా పరిషత్ లో రిపోర్టు చేసుకున్నారు.ఈయన ఐదు సంవత్సరాల పాటుగా మండలంలో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందారు.ఈ ఐదు సంవత్సరాల్లో విధి నిర్వహణలో నాకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.నూతన ఎంపీడీవో వచ్చేంత వరకు ఇన్చార్జి ఎంపీడీఓ గా ఈవోఆర్డి ఫక్రుద్దీన్ విధులు నిర్వహించనున్నారు.

About Author