NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారదర్శకంగా వాలంటీర్ల ఇంటర్వ్యూ

1 min read

పల్లెవెలుగు వెబ్​,చెన్నూరు: మండలంలో ఖాళీగా ఉన్న వాలంటీర్​ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు గురువారం ఎంపీడీవో మహబూబ్ బి తన కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీలలో ఖాళీగా ఉన్న 16 వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. దాదాపు 33 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఈ ఇంటర్వ్యూలను ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎంపికైన గ్రామ వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాలకు సేవ చేసే విధంగా వారి మన్ననలు పొందే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ శకుంతల, ఇంచార్జ్ ఈవోపీఆర్డీ రామసుబ్బారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కిరణ్ తరులు పాల్గొన్నారు.

About Author