PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రయాణం.. సాఫీగా సాగాలి…

1 min read

– ఎస్​ఐ నాగార్జున రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, మహానంది: ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గాజులపల్లి వద్ద వేగ నిరోధకాలు ఉన్నచోట వాహనచోదకులకు కనిపించేలా తెల్లటి రంగులను వేయించారు. రాత్రి లేదా పగలు పూట వాహనచోదకులు వేగంగా వస్తూ ఉంటారని, వేగ నిరోధకాలను గుర్తించకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రంగులు వేయడం వల్ల వాహనచోదకులు వేగ నిరోధక లను గుర్తించి తమ వాహనాలను వేగం తగ్గించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. వాహనచోదకులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని తమ వాహనానికి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వాహన ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

About Author