PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదిరిపోయే లాభాలు.. దూసుకెళ్లిన షేరు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐడీఎఫ్‌సీ అదిరిపోయే ఆదాయాలను ప్రకటించింది. దీంతో సోమవారం ఇంట్రా-డేలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 10 శాతం జూమ్ చేసి రూ.41.30కి చేరుకుంది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ. 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ తన అత్యధిక స్టాండ్‌లోన్ లాభాన్ని రూ. 474.33 కోట్లుగా పేర్కొంది. ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 630 కోట్ల నికర నష్టం నుంచి కోలుకుని మరీ లాభాల బాట పట్టడం గమనార్హం.

                                             

About Author