PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రెండీ టాక్‌

1 min read

సినిమా డెస్క్​ : మల్టీస్టారర్ ట్రెండ్ టాలీవుడ్‌లో కూడా షురూ అయింది. దానికి హీరోలు కూడా సిద్ధపడుతున్నారు. క్రేజీ కాంబో దొరికితే చాలు స్టోరీ సెట్‌ చేసేస్తున్నారు. అలాంటి ఓ కాంబో గురించి వినిపిస్తోన్న లేటెస్ట్ వార్త తెలుగు ప్రేక్షకుల్లో జోష్‌ని నింపుతోంది. ఆ హీరోలిద్దరూ మెగా, అక్కినేని ఫ్యామిలీస్‌కి చెందినవారు కావడమే అందుకు కారణం. సాయితేజ్, అఖిల్ కలిసి త్వరలో ఓ మూవీలో నటించనున్నారనే టాక్ టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ‘రిపబ్లిక్’ మూవీలో నటిస్తున్న సాయితేజ్‌కు ఓ డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చిందట. అయితే ఇది మల్టీస్టారర్ స్టోరీ అవడంతో మరో హీరోగా అఖిల్ లేదా నాగ చైతన్యలలో ఎవరైనా బాగుంటుందని సాయి తేజ్ భావించారట. దీంతో ఈ కథ ఇప్పుడు అక్కినేని అన్నదమ్ముల వద్దకు వెళ్లిందని.. చైతన్య – అఖిల్‌లో ఎవరు ఓకే అన్నా మెగా – అక్కినేని మల్టీస్టారర్ కు బీజం పడుతుందని టాక్ నడుస్తోంది. అయితే మెగా హీరోలు అంతమంది ఉండగా.. సాయి తేజ్ అక్కినేని హీరోలను సూచించారు అనడంలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

About Author