PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డికి ఘనసన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్​ రెడ్డిని మంగళవారం ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు. వైసీపీ మైనార్టీ స్టేట్ హిస్టరీ డైరెక్టర్​ అకాడమీ డైరెక్టర్​గా అహ్మద్ బాషను నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి చేసిన కార్యకర్తల సేవకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే సూచించారు. ఆ తరువాత స్టేట్ డైరెక్టర్ అహ్మద్ భాష మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు వైసీపీ పెద్దపీట వేస్తోందన్నారు. మార్కెట్​ యార్డు చైర్మన్​ బాష, మటన్ మస్తాన్​ సలీం డైరెక్టర్​గా, మున్సిపల్​ వైస్​ చైర్మన్​ ఎంఎం జీ గౌస్​ను నియమించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవా, అను భాష , మార్కెట్ యార్డ్ చైర్మన్ భాష , అక్బర్, ఖాదర్ భాష, ఆర్టీసీ రహీం అల్తాఫ్ జమీల్ షఫీ , మటన్ మస్తాన్ ఆమాన్ భాష , జలీల్, మభాష, నియాజ్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

About Author