PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వర్గీయ టీజీ గౌరమ్మకు ఘన నివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాజీ యంపి టీజీ వెంకటేష్ మాతృమూర్తి స్వర్గీయ టీజీ గౌరమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమం ఇవాళ వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ దివంగత మాతృమూర్తికి టీజీ వెంకటేష్ కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ గౌరమ్మ అడుగుజాడల్లో టీజీ వెంకటేష్ సేవాదృక్పథం అలవరచుకుని, గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ప్రశంసించారు. సేవకు ప్రతిరూపమైన కన్నతల్లి ఆశయాలను టీజీ వెంకటేష్ కొనసాగిస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నగరప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా హాజరైన వేలాది మందికి టీజీ వెంకటేష్  భోజనాలు ఏర్పాటు చేశారు.

About Author