PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెలుగోడులో…ఎన్టీఆర్​కు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​:శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్, శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు , వెలుగోడు పట్టణం నందు,స్వర్గీయ శ్రీ నటసార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి  వేడుకల్ని రిజర్వాయర్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు, సీనియర్ పార్టీ నాయకులు అమీర్ హంజా గారు మాట్లాడుతూ ,నందమూరి తారక రామారావు గారు, వెలుగోడు నందు రిజర్వాయర్ నిర్మించి మద్రాస్ దాకా తాగునీరు వేల పంట ఎకరాలకి సాగునీరు అందించిన ఘనత ఎన్టీరామారావు గారిది అని సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో ఎనలేని గుర్తింపు పొందిన ఒకే ఒక మహా నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ సర్పంచ్ కలాం, మాజీ ఎంపీపీ ఎల్లాల కృష్ణుడు , డాక్టర్ జాకీర్ హుస్సేన్, మోమిన్ రసూల్, బోరెల రమణారెడ్డి, విగ్రహానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు,  తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు, సీట్ల శీను షాప్ దగ్గర, భారీ ఎత్తున కేక్ కటింగ్ నిర్వహించిన,  బాణాలు కాల్చారు ,పలుచోట్ల ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు , ఐటీడిపి ప్రధాన కార్యదర్శి షేక్. హుస్సేన్ సాహెబ్ హుస్సేన్, ఐటీడీపీ ఉప అధ్యక్షులు ముజీబ్, ఎల్లల అశోక్, మజీద్ ఖాన్, గౌండ రఫీ, వాసం పుల్లయ్య,బంకు శీను, సంజీవయ్య,టాప్ అయుబ్ గని, రమణ, రషీద్, పఠాన్, కరిముల్లా, జఫీర్, సీట్ల శీను, భాస్కర్ రెడ్డి, మహేష్,  బోయారేవుల గ్రామం నుంచి సూర్యనారాయణ రెడ్డి, శేఖర్, వెంకటేశ్వర్లు, గొర్రె కృష్ణారెడ్డి, కృష్ణ హరి, రమణారెడ్డి, అబ్దుల్లాపురం గ్రామం నుంచి నరసింహారెడ్డి, శివన్న, సుబ్బయ్య, అయ్యవారి పల్లె గ్రామం నుంచి కేదార్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు , మోత్కూరు గ్రామం నుంచి రమేష్ రెడ్డి, బాలకృష్ణ, మస్తాన్ రెడ్డి,వలి తదితరులు పాల్గొన్నారు.

About Author