PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రటరికి ఘనసన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: భావితరాల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని .. ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసిన రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రటరి, కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకులు జి. సాయి ప్రసాద్​ ఐఏఎస్​ ఎందరికో ఆదర్శమని హార్ట్​ ఫౌండేషన్​ సెక్రటరి డా. చంద్రశేఖర్​ అన్నారు. తనతోపాటు డా. భవాని ప్రసాద్​తో కలిసి ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రటరి జి. సాయిప్రసాద్​ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా వేసి సన్మానించారు. అనంతరం డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ ​ 2000–2003 మధ్యలో కర్నూలు కలెక్టర్​గా విధులు నిర్వర్తించిన జి. సాయి ప్రసాద్​ ఐఏఎస్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సూపర్​ స్పెషలిటీ బ్లాక్​, ఏఎంసీ యూనిట్​తోపాటు పలు శాఖల అభివృద్ధిలో జి. సాయి ప్రసాద్​ కృషి అభినంద నీయమన్నారు. రాయలసీమతోపాటు మహబూబ్​నగర్​, కర్ణాటకలోని రాయచూరు నుంచి వివిధ వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తున్నారంటే.. అప్పట్లో కలెక్టర్​ జి. సాయి ప్రసాద్​ ఏర్పాటు చేసిన వసతులు, అభివృద్ధి, చొరవే ప్రధాన కారణమన్నారు. ఆయనకు కర్నూలువాసులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ వెల్లడించారు.

About Author