PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లయోధుడు ములాయం సింగ్ యాదవ్ కు ఘన నివాళి

1 min read

పల్లవెలుగు, వెబ్​ నంద్యాల: మల్ల యోధుడు ములాయంసింగ్ యాదవ్ మరణానికి చింతిస్తూ నంద్యాల పట్టణంలోని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ములాయం సింగ్ చిత్రపటానికి బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాల ప్రజలను కలుపుకొని మొట్టమొదటిసారిగా బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత ములాయం సింగ్ యాదవ్ కె దక్కుతుందని సంఘ నాయకులు కొనియాడారు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా లౌకిక వాదం సోషలిస్టు భావాలతో కూడిన భావాజలం తో జీవించి ముఖ్యమంత్రిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశంలో బడుగు బలహీన పేద వర్గాల ప్రజల అభివృద్ధి కృషి చేసిన గొప్ప సామాజిక న్యాయ పరిరక్షకుడు ములాన్ సింగ్ యాదవ్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర మహిళ నాయకులు విజయ గౌరీ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగ శేషు యాదవ్ నంద్యాల యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అంగజాల కృష్ణ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ అడ్వకేట్ మధు యాదవ్ అడ్వకేట్ బాలస్వామి లక్ష్మణ్ పృథ్వి రాజ్ యాదవ్ నాలి విజయ శేఖర్ నాగ సుబ్బయ్య వెంకటేష్ శ్రీను యాదవ్ పెరుగు శివ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author