PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమరవీరులకి నివాళులు.. క్యాండిల్ ర్యాలీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా విధినిర్వహణలో మరణించిన పోలీసు అమరవీరులకి నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీని నంద్యాల టౌన్ డిఎస్పి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ముందుకు సాగింది .అనంతరం ర్యాలీ గాంధీ చౌక్ చేరిన తర్వాత పోలీస్ అమరవీరులైన కానిస్టేబుల్ సురేంద్రనాథ్ మరియు హోంగార్డ్ రాజశేఖర్ గారికి నివాళులు అర్పిస్తూ సురేంద్ర అమర్ రహే ,రాజశేఖర్ అమరహే నినాదాలతో గాంధీచౌక్ మారుమొగింది. ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పి మహేశ్వర్ రెడ్డి గారితో పాటు నంద్యాల సబ్ డివిజన్ సిఐలు, మరియు ఎస్ఐలు ,రిజర్వు ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మరియు పోతుల రాజుగారు, ఆర్ఎస్ఐలు, వారి సిబ్బంది గ్రామ /వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు ,గురురాజా స్కూల్ విద్యార్థులు, టౌన్ మున్సిపల్ హై స్కూల్ NCC విద్యార్థులు పాల్గొన్నారు.

About Author