PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా స్వతంత్ర సమరయోధులకు నివాళులు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వతంత్రాన్ని సాధించి పెట్టిన సమరయోధులకు, అమర జీవులకు నివాళులు, వందన సమర్పణ కార్యక్రమం లో భాగంగా గురువారం పత్తికొండ మండల పరిధిలోని దూదేకొండ గ్రామ పంచాయితీ మజార గ్రామం జేఎం తాండ లో ఉపాధి హామీ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి ఏపీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అను నినాదంతో, స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో గ్రామ ప్రజలు, ఉపాధి హామీ సిబ్బంది మొక్కలు నాటి వారికి ఘనంగా నివాళులు, వందనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ రహమాన్, పాఠశాల ఉపాధ్యాయులు, టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్, జమలా నాయక్, గ్రామ పెద్దలు దుగ్గన్న, సరుపుద్దీన్, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author