PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీడీపీ ఆధ్వరంలో మహాత్ముడికి నివాళులు …శాంతియుత నిరసన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు తిలక్ గట్టు  ఆధ్వరంలో కర్నూల్ జిల్లా పరిషత్ దగ్గర గల మహాత్ముడి  విగ్రహం దగ్గర గాంధీ జయంతి సందర్బంగా ఐటీడీపీ కర్నూల్ సభ్యులతో కలిసి పూలతో ఆయనకు నివాళులు  అర్పించారు,దాని తదనంతరం ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు తిలక్ గట్టు టీడీపీ సభ్యులతో కలిసి ఆయన విగ్రహం ముందు కూర్చుని రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలన అంతమొంది పోవాలని , ప్రజానేత అయిన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా కేసుల్లో వైసీపీ ప్రభుత్వం ఇరికిస్తుందని , ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ప్రజాస్వామ్యం బ్రతకాలని  నినాదాలు చేస్తూ చంద్ర బాబు  అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనకు మద్దతుగా  శాంతియుతంగా నినాదాలు చేస్తూ  నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు తిలక్ గట్టు , కర్నూల్ ప్రధానకార్యదర్శి ఆనంద్ , ఐటీడీపీ నియోజకవర్గ సభ్యులు హేమకాంత్ , శేఖర్ , సాయి , రఫీక్ , అభి , అయ్యస్వామి , తెలుగుయువత రాష్ట్ర అధికారప్రతినిది జూటూరు రవి , బీసీ సెల్ రాష్ట్ర అధికారప్రతినిది రాజు యాదవ్ , ఎస్సి సెల్ నాయకులు ఏసన్న , మైనారిటీ నాయకులు వలి, హుస్సేన్ , ఇందిరాగాంధీ నగర్ వార్డ్ ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

About Author