PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎగిరిన త్రివర్ణ పతాకం…

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఎగిరిన త్రివర్ణ పతాకం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తాసిల్దార్ ,ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, మహానంది దేవస్థానం కార్యాలయాలతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు పంచాయతీ కార్యాలయం ముందు జాతీయ జెండాను అధికారులు ఎగురవేశారు. పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిపై పోరాడిన వీరులు యోధులు వారి చరిత్రలను క్లుప్తంగా వివరించారు. మహానంది క్షేత్రంలో ప్రతి ప్రవేట్ షాప్ పై జెండా ఎగిరేలా ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ షాపు యందు జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ జనార్ధన్ శెట్టి డిప్యూటీ ఎమ్మార్వో శ్రీనివాసులు ఎంపీడీవో కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవో శివ నాగ జ్యోతి మహానంది పోలీస్ స్టేషన్లో ఎస్సై నాగేంద్రప్రసాద్ మరియు సిబ్బంది పాఠశాలలో ఎంఈఓ రామసుబ్బయ్య దేవస్థాన కార్యాలయంలో ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ కే మహేశ్వర్ రెడ్డి సిబ్బంది స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. 

About Author