PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం

1 min read

పల్లెవెలుగు వెబ్​: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఆరింటిలోను టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో భానుప్రసాద్, ఎల్. రమణ గెలుపొందారు. భానుప్రసాద్ 584, ఎల్.రమణ 479 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ లోని తెరాస అభ్యర్థి దండె విఠల్ 667 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం నుంచి తాతా మధు, నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, మెదక్ నుంచి యాదవరెడ్డి గెలుపొందారు.

About Author