PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ మహానంది’ అభివృద్ధికి… టీటీడీ 4.6లక్షలు మంజూరు..

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర అభివృద్ధికి టీటీడీ 4 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు .శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం టిటిడి వారిని నిధులు మంజూరు చేయాలని కోరడంతో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు .తిరుపతిలో టిటిడి కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరావు లను కలిసి త్వరలో మహానంది క్షేత్రం లో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు మరియు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు .ఇందుకు టిటిడి వారు సుముఖత వ్యక్తం చేసి త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేస్తామని  తెలిపినట్లు వివరించారు .టీటీడీ కార్యనిర్వహణ అధికారి కి మహానంది దేవస్థానం తరపున జ్ఞాపక ను మరియు ప్రసాదాన్ని అందజేసినట్లు తెలిపారు .ఈవో వెంట మహానంది దేవస్థానం సూపర్నెంట్ వెంకటేశ్వర్లుడిప్యూటీ  ఇంజనీర్ ప్రసాద్  తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

About Author