PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు సెబ్​ ఏఎస్పీ (జేడీ)గా తుహిన్​ సిన్హా

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: కర్నూలు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ( జాయింట్​ డైరెక్టర్​)గా తుహిన్​ సిన్హా ఐపీఎస్​ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. బదిలీ పై కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా సెబ్​ ఏఎస్పీ తహిన్​ సిన్హా మాట్లాడుతూ మద్యం, నాటుసారా, ఇసుక, గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి అరికడతామన్నారు.
తొలి ప్రయత్నలోనే.. ఐపీఎస్
కర్నూలు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుహిన్​ సిన్హా ఐపీఎస్​ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో. మొదట లా పూర్తి చేశారు. 2017 బ్యాచ్ ఐపియస్ కు చెందిన వారు. సివిల్స్ రాసి తొలి ప్రయత్నంలోనే ఐపియస్ సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకుని 9 నెలలపాటు విశాఖపట్నం గ్రేహౌండ్స్ లో పనిచేశారు.

About Author