తుంగా తీరం.. పంచాంగ శ్రవణం..
1 min read
కర్నూలు: పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమ్మెతో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు విశ్వావసు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మశ్రీ కళ్ళే వేణుగోపాల్ శర్మ తో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు నుండి పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణమునకు చాలామంది భక్తులు విచ్చేశారు. అలాగే రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి , అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సతీమణి విచ్చేసి పంచాంగ శ్రవణం తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నిర్వహించినట్లు కమిటీ అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలియజేశారు.