PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జంట హత్యల కేసు.. 12 మంది అరెస్ట్

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలోని కామవరం గ్రామంలో గురువారం జంట హత్యలు జరిగాయి. కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గ్రామంలో ఓ భూవివాదానికి సంబంధించి వడ్డే మల్లికార్జున ఇంటికి మాట్లాడేందుకు వెళ్లిన శివప్ప, ఈరన్నతో పాటు మరికొందరి పై మల్లికార్జున కుటుంబ సభ్యులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో శివప్ప, ఈరన్న మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ కేసలో పరారైన నిందితుల్లో ఏడుగురిని హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు. మరో ఐదుగురు మహిళలను మండల పరిధిలోని మాచుమానుదొడ్డి గ్రామంలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

         

About Author