PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో జంట హత్యలు

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా జంట హత్యలతో ఉలిక్కిపడింది. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. కౌతాళం మండలం కామవరంలో భూముల అంశం పై వైసీపీ, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ప్రత్యర్థులను వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా చంపేశారు. చనిపోయిన ఇద్దరు వైసీపికి చెందిన శివప్ప, ఈరన్నగా గుర్తించారు. శివప్ప స్థానిక సర్పంచ్ సోదరుడని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

         

About Author