PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది : కర్నూలు జిల్లా పాణ్యం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీతారామపురం గ్రామానికి చెందిన ఇద్దరి చిన్నారులు మృతి చెందారు. మోటార్ సైకిల్ పై సీతారామపురం గ్రామం నుండి బేతంచెర్ల మండలం కొమరోలు పోతుండగా పాణ్యం వద్ద ఓ కారు వెనుక నుంచి వచ్చి బైకును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మానస( 7), తేజ(5) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి పశువుల శివయ్య, తల్లి నాగమ్మకు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు తెలిపారు.

About Author