PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇక నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిగ్రీ కోర్సులకు సంబంధించి ఓ నూతన విద్యావిధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రత్యక్ష తరగతులకు హాజరవుతూ ఒకేసారి రెండు డిగ్రీ(ఫుల్‌టైమ్‌)లు పూర్తి చేసేందుకు పచ్చజెండా ఊపింది. తొలిసారిగా అమలు చేయనున్న ఈ విధానంలో విద్యార్థులు ఒకేచోట లేదా వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో డిగ్రీలు పూర్తి చేయవచ్చు. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌ జగదీష్‌ కుమార్‌ ప్రకటన చేశారు. నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న విధంగా విద్యార్థులు రకరకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు వీలుగా ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు ఉదాహరణకు బీ కామ్‌తో పాటు గణితంలో డిగ్రీ పూర్తి చేయవచ్చునని తెలిపారు.

                         

About Author