PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇద్దరు వైద్యులు సస్పెండ్​

1 min read

– విధులకు డుమ్మా కొడితే… చర్యలు తప్పవు
– కలెక్టర్​ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, హాస్పిటల్​: అనుమతి లేకుండా కోవిడ్​ విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్​ జి. వీరపాండియన్​ హెచ్చరించారు. కర్నూలు జిజిహెచ్ ఓల్డ్ గైనిక్ వార్డ్ రూమ్ నెంబర్ 99 లో ఏర్పాటు చేసిన కోవిడ్ పేషేంట్స్ ట్రైయేజ్​ చికిత్సా కేంద్రాన్ని జేసీ(రెవెన్యూ) రామసుందర్ రెడ్డి, కె.ఎం.సి కమీషనర్ డీకే బాలాజీ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.నరేంద్రనాథ్ రెడ్డి లతో కలిసి కలెక్టర్​ జి. వీరపాండియన్​ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ కోవిడ్ పేషేంట్స్ తో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అనుమతి లేకుండా కోవిడ్​ విధులకు డుమ్మా కొట్టిన అనేస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.సుధీర్ కుమార్, మరో పీజీ డాక్టర్ బి.సురేష్ బాబు (ఫిజియాలజి) అనే ఇద్దరు సీనియర్ డాక్టర్లు వెంటనే సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫిర్యాదులపై… ఫైర్​..: కర్నూలు జిజిహెచ్ లో కోవిడ్ బాధితుల వైద్య విధులకు కొందరు సీనియర్ డాక్టర్లు గా ఉన్న ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గైర్హాజరు అవుతున్నారని, పేషేంట్స్ వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని, జూనియర్ డాక్టర్లతో నడిపిస్తున్నారని, ట్రయాజ్ కు వచ్చిన కోవిడ్ పేషేంట్స్ ను పట్టించుకోవడం లేదని, వెంటనే అడ్మిషన్ చేసుకోవడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని, మీడియాలో అడ్వర్స్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని, సీనియర్ డాక్టర్లు కోవిడ్ పేషేంట్స్ ను పట్టించుకోకపోవడం వల్ల జిల్లా యంత్రాంగానికి/ ప్రభుత్వానికి అపవాదు వస్తోందని అందువల్లనే ఇద్దరు సీనియర్​ వైద్యులను సస్పెండ్​ చేసినట్లు కలెక్టర్​ జి. వీరపాండియన్​ స్పష్టం చేశారు.

About Author