PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాక్టర్​, బైక్​ ఢీ… ఇద్దరి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కల్లూరు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం యాపర్లపాడు గ్రామ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలు ఇద్దరు మృతి చెందారు. ఘటనకు సంబంధించి ఉలిందకొండ ఎస్​ఐ శరత్​ కుమార్​ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉలిందకొండ నుండి శ్రీరాములు,భార్య లక్ష్మీదేవితో కలిసి పనుల నిమిత్తం ద్విచక్ర ( ఏపీ 21 ఏసీ 4459) వాహనం పై బయలుదేరారు. యాపర్లపాడు రోడ్డు వద్ద వేగంగా వెళ్తున్న ట్రాక్టర్​ ప్రమాదవశాత్తు బైక్​ను ఢీకొంది. సమాచారం తెలియగానే ఉలిందకొండ ఎస్​ఐ శరత్​ కుమార్​ రెడ్డి సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య లక్ష్మిదేవి కొనఊపిరితో ఉండగా వైద్యచికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోలుకోలేక లక్ష్మిదేవి మృతి చెందింది.


About Author