NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుర్తు తెలియని వాహనం ఢీ..

1 min read

– ఇద్దరు మృతి
పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి 7 గంటల సమయంలో పత్తికొండలోని హోసూరు రోడ్డులో జరిగింది. విషయం తెలుసుకున్న టౌన్​ సీఐ ఆదినారాయణ ఘటనా స్థలిని పరిశీలించారు. పట్టణానికి చెందిన చాంద్​(33), జిలాని (28) బురుజుల గ్రామంలో బేల్దారు పని ముగించుకుని తిరిగి పత్తికొండకు బైకుపై హోసూరు రోడ్డుపై వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పత్తికొండ ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About Author