NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇద్దరు మంత్రుల అరెస్టు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నార‌దా కుంభ‌కోణంలో ఇద్దరు తృణ‌మూల్ కాంగ్రెస్ మంత్రుల‌ను సీబీఐ అరెస్టు చేసింది. నాలుగేళ్లనాటి కుంభ‌కోణంలో మంత్రుల‌ను అరెస్టు చేయ‌డంతో ప‌శ్చిమ‌బెంగాల్లో రాజ‌కీయ వేడి ర‌గిలింది. మంత్రుల అరెస్టుకు నిర‌స‌న‌గా సీఎం మ‌మ‌త బెన‌ర్జీ స్వయంగా సీబీఐ కార్యాల‌యానికి వెళ్లి 6 గంట‌ల పాటు నిర‌స‌న తెలిపారు. త‌న‌ను కూడ అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. మంత్రుల మీద విచార‌ణ‌కు గ‌వ‌ర్నర్ అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెల‌రేగింది. మంత్రుల అరెస్టుకు నిర‌స‌న‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ కార్యక‌ర్తలు రాజ్ భ‌వ‌న్, సీబీఐ కేంద్రాల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. బీజేపీ క‌క్షసాధింపు చ‌ర్యల్లో భాగమే ఈ అరెస్టుల‌ని ఆరోపించారు.

About Author