PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు.. అప్రమత్తం !

1 min read
   
        ప‌ల్లె వెలుగు వెబ్ :     తెలంగాణ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సోమాలియా, కెన్యా దేశం నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు అధికారులు పరీక్షల్లో గుర్తించారు.  ఇద్దరిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందించనున్నట్లు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. మెహదీపట్నం, టోలీచౌక్‌ లో వీరిని గుర్తించి పరీక్షలు చేయగా ఒమిక్రాన్‌గా తేలినట్లు డీహెచ్‌ పేర్కొన్నారు. దీంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. 

                

About Author