PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరదనీటి లో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు

1 min read

– ఒకరు సురక్షితం.. మరొకరు గల్లంతు…
పల్లెవెలుగువెబ్​, రాయచోటి/వీరబల్లి : కడప జిల్లా వీరబల్లి మండలం గడికోట గ్రామం యర్రపాపిరెడ్డిగారిపల్లె వద్ద శనివారం మండవ్యనది దాటుతూ వరద నీటిలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఒకరు సురక్షితం కాగా.. మరొకరు గల్లంతు అయ్యారు. వివరాలిలా ఉన్నాయి. బెంగుళూరులో ఓ ప్రైవేట్​ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్​రాజు, కర్నాటక కు చెందిన కారు డ్రైవర్ కారక గోవింద రావు(45) దసరా సెలవులు కావడంతో స్వగ్రామం గడికోటకు వచ్చారు. భారీ వర్షాలు మాండవ్యనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోశనివారం తెల్లవారు జామున ఇద్దరు నదిని దాటుతుండగా కొట్టుకుపోయారు. స్థానికుల సహాయం తో కరుణాకర్ రాజును అతికష్టం మీద కాపాడగా, గోవింద రావు గల్లంతయ్యారు .గల్లంతైన డ్రైవర్ గోవింద రావు(45) కోసం రెవిన్యూ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

About Author