NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ పబ్లిసిటీ కి  ఇద్దరు యువకుల బలి       

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి మండలం లోని పిఆర్ పల్లి గ్రామం దగ్గర జరిగిన సంఘటనలో వైసీపీ వారి పబ్లిసిటీ కి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టే కార్మికుల యువకులు ఇద్దరు దుర్మరణం చెందినట్లు  తెలుగుదేశం పార్టీ ప్యాపిలి మండలం అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్యమరియు మండల కమిటీతెలుస్తోంద  ప్రకటనలో వారు  తెలిపారు. ఈసందర్భంగా గురువారం మాట్లాడుతూ వైసిపి పబ్లిసిటీ కోసం పిఆర్ పల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో  ఒకరు మైనర్ అని కూడా తెలుస్తోంది, ఇద్దరు యువకుల కుటుంబాలకి ప్రభుత్వం తక్షణమే ఒకరి ఒకరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆ కుటుంబంలోని మరొకరికి ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశము కల్పించాలని ప్యాపిలి మండలం తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.  ఈ దుర్ఘటన మీద న్యాయ విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారి మీద తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నారు.

About Author