NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌ష్యా చ‌ర్య‌ల పై యూఎన్ ఓటింగ్.. భార‌త్ దూరం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేప‌థ్యంలో ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశం అయింది. రష్యా చర్యలను ఖండిస్తూ భద్రతా మండలిలో భద్రతా మండలిలో ఓటింగ్‌ నిర్వహించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ఈ ప్రతిపాదనపై మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భద్రతా మండలిలో అయిదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా.. తన విటో అధికారాన్ని ఉపయోగించి తీర్మాణాన్ని వీగిపోయేలా చేసింది. ఈ సంద‌ర్భంగా భార‌త్ ఓటింగ్ కు దూరంగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలని భద్రతా మండలికి ఐరాస భార‌త రాయ‌బారి టీఎస్. తిరుమూర్తి సూచించారు. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భారత్‌ తీవ్ర ఆందోళనకు గురవుతోందని తెలిపారు. హింసను తక్షణమే నిలిపివేసేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు.

                               

About Author