PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల నుంచి వచ్చే స్పందనను చూసి ఓర్చుకోలేక దాడులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  శుక్రవారం పుంగునూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  పై  జరిగిన దాడిని తీవ్రంగా ఖండించానా హోలగుంద మండలం టీడీ పీ నాయకులు.ఈరోజు హోలగుంద టీడీపీ కార్యాలయంలో కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య & నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో  ఆటవిక రాజ్యం రాజ్యమేలుతుందని చంద్రబాబు నాయుడు  సభలకు ప్రజల నుంచి వచ్చే స్పందనను చూసి  ఈ వైసీపీ నాయకులు ఓర్చుకోలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలుగాను ఎప్పుడు  భయపడరని ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి  తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులకు వైసిపి నాయకులు భవిష్యత్తులో తగిన  మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు, ఐటీడీపీ నాయకులు, కోట్ల యూత్, నాయకులు, నారా & నందమూరి అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author