NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉండవెల్లి వెంకటన్న

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండవెల్లి వెంకటన్న ని నియమించడమైనది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావుసూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి  ఆదేశాల మేరకు వెంకటన్న ని జిల్లా కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ చైర్మన్ గా నియమించి ఆయనకు నియామక పత్రమును అందించి ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని డిసిసి అధ్యక్షులు కె బాబురావు  తెలియజేశారు. వెంకటన్న  మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ప్రియతమ జాతీయ కాంగ్రెస్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ కి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే కి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ కి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ప్రతి ఒక్కరూ విలువలకు, క్రమశిక్షణకు కట్టుబడి పార్టీలో పని చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా శాయశక్తుల కృషి చేస్తానని వెంకటన్న  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ చైర్మన్ విశ్రాంత ఉన్నతాధికారి ఎస్ రామస్వామి , డిసిసి ప్రధాన కార్యదర్శులు షేక్ నవీద్, కె సత్యనారాయణ గుప్త, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, ఓబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట రాముడు మంత్రాలయం కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోసిగి కె జిలాని జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాద్రి పాష, డీసిసి కార్యదర్శి ఈ శ్రీనివాస రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author