PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవోపా ఆధ్వర్యంలో.. బాలికలకు గోష్​సెట్​ అందజేత

1 min read

శ్రీరంగాపురం: అవోపా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా స్వామి వివేకానంద సంస్కృత ఉన్నత పాఠశాల బాలికల కోసం 46 పరికరాలు గల ఒక గోస్ సెట్  అందజేశారు. ఈ సందర్భంగా  అవోపా  అధ్యక్షులు గోనూరు యుగంధర్ శెట్టి మాట్లాడుతూ బాలబాలికలకు చదువుతో  పాటు క్రీడలు,సంగీతం నేర్పించడం అభినందనీయమన్నారు. అనంతరం  స్కూల్ హెడ్మాస్టర్ శ్రీమతి నీలవేణి మాట్లాడుతూ  అవోపా వారి సేవలు ప్రశంసనీయమన్నారు. గోష్​సెట్​ పరికరాలను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే స్కూల్లో చదువుకున్న పిల్లలు దేశ విదేశాల్లో  స్థిరపడ్డారు వారు కూడా మాతృదేశానికి చదువుకున్న స్కూలుకు విశేష సేవలు అందిస్తున్న వారికి అభినందనలు మరియు పిల్లలు మధ్యాహ్నం భోజనం చేయడానికి , ఆటలు ఆడుకోవడానికి 40×40 సైజ్  కాంక్రీట్ బెడ్,మరియు సఫారీ ఫ్లోరింగ్  వేసి  ఇవ్వమన్నారు దాదాపు లక్షా 25 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు ఆ విషయాన్ని కమిటీ వారు సానుకూలంగా స్పందించారు.  ఈ కార్యక్రమంలో  దాతలు  మల్లిపెద్దు నాగేశ్వరరావు కొండూరు రవికుమార్ ,అగిరి నాగరాజు,మరియు అవోపా నగర కార్యదర్శి పోలేపల్లి శేషయ్య నాగేళ్ల హరికిషన్ ఇల్లురు సూర్యనారాయణ నగెళ్ళఅజయ్  సుబ్బయ్య స్కూల్ హెడ్మాస్టర్ శ్రీమతి నీలవేణి సుబ్బా నరసయ్య య, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author