PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూల్లోని నిరుద్యోగ యువ‌త‌ కోసం ప్ర‌త్యేకంగా జాబ్ మేళా

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

న‌న్ను గెలిపిస్తే యువ‌త‌కు మంచి భ‌విష్య‌త్తు అందిస్తా.. టి.జి భ‌ర‌త్

మౌర్య ఇన్‌లో జాబ్ మేళా పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూల్లో ఉన్న నిరుద్యోగ యువ‌త‌ కోసం ప్ర‌త్యేకంగా జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ తెలిపారు. మౌర్య ఇన్‌లో ఆయ‌న జాబ్ మేళాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ నిరుద్యోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నార‌న్నారు. త‌మ కంపెనీలో వేలాది మందికి ఉపాధి క‌ల్పించామ‌ని.. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగం కావాలంటూ త‌న వ‌ద్ద‌కు రోజూ 10 దాకా అప్లికేష‌న్లు వ‌స్తున్నాయ‌న్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 18 కంపెనీల‌తో మాట్లాడి ఈ నెల 24వ తేదీన మౌర్య ఇన్‌లో జాబ్ మేళా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ప్ర‌తి నెల లేదా రెండు నెల‌ల‌కు ఒక‌సారి ఇలాంటి జాబ్ మేళాల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్లు భ‌ర‌త్ చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే క‌ర్నూలుకు కంపెనీలు తీసుకొచ్చి ఇక్క‌డే ఉద్యోగాలు క‌ల్పించే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని చెప్పారు. పారిశ్రామిక‌వేత్త‌గా ఇక్క‌డ‌కు ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చే స‌త్తా త‌న‌కు ఉంద‌ని టి.జి భ‌ర‌త్ అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే యువ‌త‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, హెచ్‌.డి.ఆర్ యూత్ స‌భ్యులు శివ‌, జ‌నార్ధ‌న్‌, రాజ‌శేఖ‌ర్‌, ఈశ్వ‌ర్‌, శీను, ప‌ర‌మేశ్‌, శ్రీనాథ్‌, భ‌ర‌త్‌, కుమార్‌, ధ‌ను, రాజు, ర‌మేష్‌, మ‌ధు, సాయి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author