PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడపగడపకు మన ప్రభుత్వం కు అనూహ్య స్పందన

1 min read

– ఎంపీపీ చీర్ల.. వైఎస్సార్ సీపీ యువ నాయకులు చల్ల అన్వేష్ రెడ్డి
పల్లె వెలుగు వెబ్​ చె​న్నూరు : గడపగడపకు ప్రభుత్వం లో భాగంగా కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గ గ్రామాలలోని ప్రతి గడపకు వెళ్లి వారి వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, ఇంకా మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని మరి అడిగి తెలుసుకుని వారి సమస్యలకు అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపడం తో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయని, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, వై ఎస్ ఆర్ సి పి యువ నాయకులు చల్లా అన్వేష్ రెడ్డి లు అన్నారు, శుక్రవారం వారు చెన్నూరు లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా, అందకుండా ఉంటే ఎందుకు అందడం లేదు, గ్రామాలలో ఇంకా ఏవైనా ప్రజలకు సమస్యలు ఉన్నాయా క్షేత్రస్థాయిలో తెలుసు కునేందుకె గడపగడపకు మన ప్రభుత్వం లక్ష్యమని వారు తెలిపారు, గతంలో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పనులు మానుకొని తిరిగే వారని వారు తెలిపారు , నేడు అలాంటి పరిస్థితి లేదని, ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందివ్వాలనే లక్ష్యంగా పెట్టుకుందని వారు అన్నారు, ఇందులో కులాలు చూడరు, మతాలు చూడరు, పార్టీలు అసలే చూడరని వారు తెలిపారు , అర్హులు అయితే చాలు సంక్షేమ పథకాలు నేరుగా వారి ఇంటికే చేరుతాయని వారు అన్నారు , అంతేకాకుండా గత ప్రభుత్వం లో జన్మభూమి కమిటీల ద్వారా ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే పథకాలు వర్తించేవని, నేడు ఆ సంస్కృతికి చరమగీతం పాడిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు కొనియాడారు, కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గడపగడపకు వెళ్లి సహృదయంతో అక్కడి ప్రజల తో మమేకమై వారి కష్టసుఖాలు, అలాగే వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరిస్తుంటే, అక్కడి ప్రజల ముఖాల్లోని ఆనందాన్ని మాటల్లో వర్ణించ లేమని వారు అన్నారు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో వై ఎస్ ఆర్ సిపి ప్రభుత్వం, ప్రజలతో మమేకమై ఇంకా ముందుకెళ్లిందని, అన్ని వర్గాల ప్రజలు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారని ఆయన తెలిపారు, ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకం తో పాటు, సాక్షాత్తు ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే అధికారులు కూడా తమ ఇళ్ల వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి, మీ సమస్యలు పరిష్కరించేందుకు మేమంతా మీ వద్దకు వచ్చాం అని చెప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అందుకే గడప గడప కు మన ప్రభుత్వం ను అంత గొప్పగా ప్రజలు ఆదరిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని వారు తెలిపారు, ఇంత మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారని వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కొండ పేట సర్పంచ్ తుంగ చంద్ర శేఖర్ యాదవ్, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.

విలేకరుల, అన్ని వర్గాల, క్షేత్రస్థాయిలో

About Author