PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగ సంఘాల నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : పీఆర్సీ జీవో విడుదల చేయొద్దంటూ ఉద్యోగ సంఘాల నిరసనల నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. యూనియన్ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. “ గతంలో ఎప్పుడూ 27 శాతం ఐఆర్ ఇవ్వలేదు. ఐఆర్‌ కింద రూ.17,918 కోట్లు చెల్లించింది వాస్తవం కాదా?. ఐఆర్‌ను జీతంలో భాగంగా ఎలా పరిగణిస్తారు?. హెచ్‌ఆర్‌ఏ అనేది జీతభత్యాల్లో భాగం కాదా?. పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవం. మొత్తం జీతం పెరిగిందా.. లేదా అనేది చూడాలి. ఉద్యోగులు ఆశించనమేరకు చేయలేకపోయినందుకు బాధగానే ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చింది. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దు’’ అని పేర్నినాని వ్యాఖ్యానించారు.

        

About Author