PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇలా చేస్తే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌ప్ప‌కుండా త‌గ్గుతాయి !

1 min read

పల్లెవెలుగు వెబ్: పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గింపుపై కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) పరిధిలోకి తెస్తే వాటిపై పన్నులు తగ్గుతాయ‌ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతునిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పకుండా వీటిని జీఎస్‌టీలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తార‌ని గడ్కరీ చెప్పారు. జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తేవడాన్ని ఇష్టపడటం లేదు అని ఆయ‌న అన్నారు.

About Author