NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో కేంద్ర మంత్రి ప్రహ్లద జోషి

1 min read

మంత్రాలయం, న్యూస్​ నేడు:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ & నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. వీరికి ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, ఎంపి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తహసీల్దార్ రవి, మఠం అధికారులు ఏఏఓ మాధవ శెట్టి, వెంకటేష్ జోషి, శ్రీ పతి, జోనల్ మేనేజర్ ఐపీ నరసింహ స్వామి స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట అధికారులు తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *