NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అఖిలేశ్ కు పోటీగా కేంద్రమంత్రి !

1 min read

పల్లెవెలుగువెబ్ : యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు పోటీగా కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ ను బీజేపీ బరిలోకి దించింది. మెయిన్ పురి జిల్లా కర్హల్ నుంచి వీరిద్దరూ పోటీ చేస్తున్నారు. పోలీస్‌ ఎస్‌ఐగా తన కెరీర్‌ ప్రారంభించిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌.. మాజీ సీఎం, ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎస్పీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఎస్పీలో చేరిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌కు 2014లో మాయావతి రాజ్యసభ సీటు ఇచ్చారు. అనంతరం బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయి.. మంత్రిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆగ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మోదీ కేబినెట్‌లో న్యాయ శాఖ సహా మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా కర్హల్ నియోజకవర్గం యాదవులకు కంచుకోట. మొత్తం 3.5 లక్షల ఓటర్లు ఉంటే.. వారిలో 1.5 లక్షల ఓట్లు యాదవులవే ఉన్నాయి.

       

About Author