NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రిప్టో క‌రెన్సీ పై కేంద్ర మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: బిట్ కాయిన్ పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు సోమవారం మొదల‌య్యాయి.  లోక్‌సభ కాసేపు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన తరుణంలో  .. బిట్‌కాయిన్‌కు సంబంధించిన నిర్మలాసీతారామ‌న్ కీలక ప్రకటన చేశారు . ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో ‘బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం చేస్తోందా?’ అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘అలాంటిదేం లేదు సర్‌’ అని సమాధానం ఇచ్చారు. దీంతో క్రిప్టోక‌రెన్సీ పై కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన‌మైన నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న సంకేతాలు వెలువ‌డ్డాయి.

About Author