PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ నిర్మాణానికి ఐక్యత ప్రధానం.. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : దేశ నిర్మాణానికి పౌరులు అందరు ఐక్యంగా ఉండాలని జిల్లా గ్రామ పంచాయతీ  అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ డి యల్ పి ఓలు, విస్తరణ అధికారులు, డీపీఓ కార్యాలయం సిబ్బందితో ఐక్యతపై ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు సందర్బంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పులుపునిచ్చారు. కార్యక్రమంలో డి యల్ పి ఓ చంద్రశేఖర్, రజ ఉల్లాహ్, విస్తరణ అధికారులు సుందరి, సరళకుమారి, సంసద్దీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author