NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూపీ.. గెలిచినా బాధ‌లో ఉన్న బీజేపీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. 273 సీట్లను కైవసం చేసుకొని విజయదుందుభి మోగించింది. అయితే యూపీ డిప్యూటీ సీఎంతో సహా 11మంది రాష్ట్ర మంత్రులు ఘోర పరాజయం పాలయ్యారు. సగం కంటే అధిక స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన అధికార బీజేపీకి 11 మంది మంత్రులు ఓటమి పాలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యాతోపాటు మరో 10 మంది మంత్రులు ఓటమి చవిచూశారు. గడచిన 30 ఏళ్లలో రెండవసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించినా 11 మంది ఓటమి అధికార బీజేపీకి మింగుడు పడటం లేదు.

                                           

About Author