PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాబోయే  ఎన్నికల నేపథ్యంలో బిఎస్ఎఫ్ పోలీసు బృందం కవాతు

1 min read

సమస్యాత్మక గ్రామాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బృందాలతో రూట్ మార్చ్.

పల్లెవెలుగు వెబ్  వెలుగోడు:  రాబోయే ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాడు వెలుగోడు పట్టణంలో   ఆత్మకూరు సిఐ నాగభూషణం, ఆత్మకూరు టౌన్ ఎస్ఐ నారాయణరెడ్డి ,వెలుగోడు ఎస్సై భూపాలుడు ఆధ్వర్యంలో బి ఎస్ ఎఫ్ బలగాలు మరియు పోలీసుబృందంతోకవాతునిర్వహించారు.ఈ ప్రత్యేక దళాల కవాతు స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుండి ప్రారంభమై పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా పాత బస్టాండ్ చేరుకుంది.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ రాబోవు ఎన్నికలను ప్రజలందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానిర్వహించుకోవాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలన్నారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, ప్రోత్సహించిన అటువంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు, పట్టుబడితే కఠినమైన శిక్షలు విధించడంజరుగుతుందన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు అన్ని విధములైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు .

About Author