PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వం చాటుకున్న పట్టణ సీఐ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప : రామాపురం మండలం చిట్లూరు గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ తన కుమారుడికి ఆరోగ్యం సరిగా లేకపోతే.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని బస్సు కోసం ఠాణా సర్కిల్​ వద్ద వేచి చూస్తోంది. కర్ఫ్యూ నేపథ్యంలో వాహనాలు ఏవీ లేకపోవడంతో… తల్లి పిల్లలను గమనించిన పట్టణ సీఐ జి. రాజు వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి జ్యూస్​ అందజేసి… వారి ఇంటి వద్ద విడిచి పెట్టి రావాలని సిబ్బందిని ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పట్టణ సీఐ మానవత్వం చూపడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

About Author