PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుకుంద ఈరన్నస్వామి సన్నిధిలో తిక్కారెడ్డి

1 min read

టీడీపీ టిక్కెట్​ తనకే రావాలని .. ప్రత్యేక పూజలు

  • ఉరుకుంద గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించిన తిక్కారెడ్డి
  • దేవుడి ఆశీస్సులు.. ప్రజల దీవెనతో అసెంబ్లీకి వెళ్తానని… ప్రచారంలో వెల్లడి…

 కౌతాళం, పల్లెవెలుగు:మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి నాకు కచ్చితంగా టికెట్ ఇస్తారని నన్ను ఆశీర్వదించాలని కౌతాళం మండలం ఉరుకుందు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ( ఈరన్న) దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి శాలువా పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి గారు స్ధానిక సీనియర్ నాయకులు తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కోట్రేష్ గౌడ్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి నాకు టికెట్ ఇస్తారని నన్ను ఆశీర్వదించాలని నాయకులకు కార్యకర్తలకు పాలకుర్తి తిక్కారెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, బాపురం వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, సర్పంచ్ సురేంద్ర, డాక్టర్ రాజానంద్, బీసీ సాధికార రాష్ట్ర సభ్యులు సిద్ధు, ఏరిగేరి బసవరాజు,బదినేహల్ ఉమేష్ గౌడ్,ఐ టిడిపి టిమ్ మంజునాథ్ ధని, దుద్ది ఉసేని, ఏరిగేరి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author