PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉరుకుంద’ రాజగోపురం.. లక్ష విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కౌతాళం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద (నరసింహ) ఈరన్న స్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణం కోసం గంగావతి వాస్తవ్యులైన A పద్మజ,A గోవిందరాజు దంపతులు ₹1,00,116/- విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ లక్ష్మినరసింహ స్వామి ఆశీర్వాదంతో రైతులు, భక్తులు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకు ముందు దేవస్థాన సిబ్బంది దాతలకు శ్రీ స్వామివారి దర్శనం కల్పించి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమము నందు సూపరింటెండెంట్​ వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధాన అర్చక ఈరప్ప స్వాముల పాల్గొన్నారు.

About Author