PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా వి. శ్రీనివాస‌రావు ఎన్నిక

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీపీఎం ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా వి. శ్రీనివాస‌రావు ఎన్నిక‌య్యారు. పార్టీ మహాసభల్లో చివరిరోజైన బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంఏ గఫూర్, వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌ నరసింగరావు, సీహెచ్‌.బాబూరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, డి.రమాదేవి, మంతెన సీతారాం, బి.తులసీదాస్, వి.వెంకటేశ్వర్లు, పి.జమలయ్య,కె.లోకనాథం, మూలం రమేష్, ఆహ్వానితులుగా కె.సుబ్బరావమ్మ, సురేంద్ర కిల్లో ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన వి. శ్రీనివాస‌రావు స్వ‌స్థ‌లం ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామం. బివి. రాఘ‌వులు త‌ర్వాత ప్ర‌కాశం జిల్లా నుంచి రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన రెండో వ్య‌క్తి శ్రీనివాస‌రావు.

                                  

About Author